కురవి : ఎదురెదురుగా వస్తు న్నద్విచక్రవాహనం, మారుతి కారు ఢీకొన్న ఘటనలో ఇద్ద రు తీవ్రంగా గాయపడిన ఘ టన శుక్రవారం కురవి శివారులోని 365 జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వి వరాలిలా ఉన్నాయి.. అబ్బాయిపాలెం శివారు దారావత్ తండాకు చెందిన దారావత్ శ్రీను,దారావత్మనోర్య, రవి ద్విచక్రవాహనంపై మహబూబాబాద్ నుంచి కురవి వైపు వస్తున్నారు. మరిపెడకు బెజ్జంకి రమేష్ బంగ్లా నుంచి మహబూబాబాద్కు మారుతి కారులో వెళ్తుండగా కురవి శివారులోని పెద్ద చెరువు సమీపంలో ద్విచక్రవాహనం, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ఉన్న శ్రీను, మనోర్య తీవ్రంగా గాయపడ్డారు. శ్రీను ఎడమ కాలు రెండు చోట్ల విరిగి నుజ్జునుజ్జయింది. మనోర్య ఎడమ కాలు విరిగింది. రవి ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. క్షతగాత్రులను కురవి ఎస్సై జె.రామకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది ఆటోలో మానుకోట ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.