రాళ్లు మీద పడి ఇద్దరు కూలీల మృతి

1 Jun, 2016 15:19 IST|Sakshi

మార్కాపురం (ప్రకాశం జిల్లా) : మార్కాపురం మండలం రాయవరంలో ఉన్న ఓ క్వారీలో రాళ్లు మీద పడి ఇద్దరు కూలీలు మృతిచెందారు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మృతులు తుర్లుపాడు మండలం గానుగపెంట గ్రామానికి చెందిన గోగు బాలగురవయ్య(25), ఈర్ల గురవయ్య(26)గా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు