మట్టి పెళ్లలు పడి ఇద్దరు కూలీలు మృతి

27 Apr, 2016 15:56 IST|Sakshi

మట్టిపెళ్లలు విరిగి పడి ఇద్దరు కూలీలు మృతిచెందారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా బెరైడ్డిపల్లె మండలం పెద్దచెరువలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లక్ష్మప్ప(22), మునిరత్నంరెడ్డి(35) పెద్ద చెరువులో నుంచి ఇసుక తరలిస్తుండగా.. ప్రమాదవశాత్తు మట్టిపెళ్లలు మీద పడి అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు