హోలీ వేడుకల్లో అపశ్రుతి

12 Mar, 2017 13:51 IST|Sakshi
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. హోలీ సంబరాల్లో మునిగితేలిన ఇద్దరు యువకులు రంగులు కడుక్కోవడానికి గోదావరిలో దిగి నీట మునిగి గల్లంతయ్యారు. స్థానిక సాయి డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న మొరాంపూడి రాంప్రసాద్‌(19), బోటా రమేష్‌(19) స్నేహితులతో కలిసి హోలీ వేడుకలు జరుపుకున్నారు. అనంతరం స్నానం చేయడానికి గోదావరికి వెళ్లిన యువకులు ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇద్దరు యువకుల బంధువుల రోదనలతో గోదావరి తీరం ఉద్వేగంగా మారింది. 
మరిన్ని వార్తలు