-

గుర్తుతెలియని వ్యక్తి మృతి

25 Sep, 2016 22:14 IST|Sakshi
గుర్తుతెలియని వ్యక్తి మృతి

రాయచోటి రూరల్‌: రాయచోటి పట్టణ పరిధిలోని పాత రాయచోటి శివాలయం సమీపంలో శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. అతనికి 55 ఏళ్లు ఉండవచ్చని వారు తెలిపారు. తల, తోడలకు గాయాలు ఉన్నట్లు సమాచారం. విషయం తెలియగానే ఎస్‌ఐ రమేష్‌బాబు సంఘటన స్థలానికి చేరుకుని, పరిశీలించారు. మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం రాయచోటి మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు