మిర్యాలగూడ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మిర్యాలగూడలో 62వ రాష్ట్ర స్థాయి అండర్–19 క్రీడలు రెండో రోజైన ఆదివారం కొనసాగాయి. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కబడ్డీ, షూటింగ్ పోటీలు నిర్వహించగా, నాగార్జున జూనియర్ కళాశాలలో బాల్బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. బాల్ బ్యాడ్మింటన్ పోటీలను స్థానిక డీఎస్పీ రాంగోపాల్రావు ప్రారంభించారు. మొదటి రోజు వర్షం కారణంగా నిలిచిపోయిన క్రీడలను రెండో రోజు నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మాలి కృష్ణారెడ్డి, సీఐ భిక్షపతి, అనుముల మధుసూదన్రెడ్డి, వాడపల్లి రమేష్ పాల్గొన్నారు.