గొంతు కోసి పెట్రోల్ పోసి కాల్చారు

4 Dec, 2016 11:00 IST|Sakshi
ప్రకాశం: జిల్లాలోని సంతనూతలపాడు మండలం మంగనూరు గ్రామ శివారులో ఒక వ్యక్తిని దుండగులు గొంతుకోసి ఆపై పెట్రోల్‌పోసి కాల్చిన చంపారు. ఈ సంఘటన ఆదివారం ఉదయం వెలుగుచూసింది. గ్రామస్తులు పొలాలకు వెళుతుండగా దారి పక్కన గుర్తు పట్టలేని స్థితిలో ఉన్న ఒక వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నారు. స్ధానికుల సమాచారంతో ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తి గొంతు కోసి పెట్రోల్‌ పోసి తగులబెట్టినట్లు భావిస్తున్నారు.
 
మరిన్ని వార్తలు