గుర్తు తెలియని శవం లభ్యం

15 May, 2017 00:00 IST|Sakshi
నంద్యాలవిద్య: నంద్యాల మండల పరిధిలోని నందిపల్లె–నంద్యాల మధ్యలో రైలు పట్టాల వద్ద గుర్తు తెలియని శవం లభ్యమైంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం రైలు ఢీకొన్న ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మ​ృతిచెందాడు. మ​ృతుడు ఆకుపచ్చ షర్టు, కాకి ప్యాంట్‌ ధరించి ఉనా​‍్నడు. సుమారు 35 సంవత్సరాల వయస్సు ఉంటుంది. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు సెల్‌: 8522923203కు సంప్రదించాలని కోరారు.
 
మరిన్ని వార్తలు