మనీలా సదస్సుకు ఉషారాణి

3 Jul, 2016 19:54 IST|Sakshi

 ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో ఈ నెల 6 నుంచి 7వ తేదీ వరకు జరగనున్న ఇంటర్నేషనల్ ట్రేడ్ యూనియన్ కాన్ఫరెన్స్ (ఏషియన్ పొలిటిక్స్) సదస్సుకు గుంటూరులోని పాత గుంటూరుకు చెందిన ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాన్ఫరెన్స్ ఉమెన్స్ వింగ్ జనరల్ సెక్రటరీ, బ్యాడ్మింటన్ కోచ్ గారా ఉషారాణి ఎంపికైంది. ఉషారాణి మాట్లాడుతూ మహిళలను అన్ని రంగాల్లో శక్తిమంతులుగా తీర్చిదిద్దేందుకు సదస్సు దోహదపడుతుందన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి బయలుదేరి మనీలాకు వెళుతున్నట్లు ఆమె చెప్పారు. ఉషారాణికి జిల్లా అధ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి జి.శేషయ్య, క్రీడాకారులు, నాయకులు అభినందనలు తెలిపారు.

 

మరిన్ని వార్తలు