ఉచిత వైద్య శిబిరాలను సద్వినిమోగం చేసుకోండి

12 Dec, 2016 15:03 IST|Sakshi

కలసపాడు: పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఉచిత పశువైద్యశిబిరాలను పాడిరైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల పశువైద్యాధికారి సి.చెన్నారెడ్డి తెలిపారు. శనివారం మండల పరిధిలోని శంకవరం గ్రామంలో  ఉచిత పశువైద్య శిబిరం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువులకు రోగాలు రాకమందు అప్రమత్తమైతే పశుసంతతిని కాపాడుకోవచ్చని తెలిపారు.శంకవరం గ్రామంలో జరిగిన పశువైద్య శిబిరంలో 10 పశువులకు శస్త్రచికిత్సలు,16 పశువులకు సాధారణ చికిత్సలు, 25 దూడలకు నట్టల నివారణ మందును పంపిణీ చేసినట్లు డాక్డర్‌ చెన్నారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది, పాడి రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు