ఇంటర్నెట్‌ సేవలు వినియోగించుకోవాలి

24 Aug, 2016 01:55 IST|Sakshi
ఇంటర్నెట్‌ సేవలు వినియోగించుకోవాలి
  •  జేసీ–2 రాజ్‌కుమార్‌
  • నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట):
    ప్రజలందరూ ఇంటర్నెట్‌ సేవలను వినియోగించుకోవాలని జేసీ–2 సాల్మన్‌ రాజ్‌కుమార్‌ అన్నారు. Mýృష్ణాపుష్కరాల నేపథ్యంలో స్థానిక పాత జెడ్పీ సమావేశ మందిరంలో జరుగుతున్న చర్చావేదికలో మంగళవారం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఈ పాస్‌ విధానంపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచం మొత్తం ఇంటర్నెట్‌ సేవలపై ఆధారపడి ఉందన్నారు. ప్రభుత్వ సేవలు, సదుపాయాలు ఇంటర్నెట్‌ ద్వారా ప్రజలకు అందుతున్నాయని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల్లో విద్య సైతం ఆన్‌లైన్‌లో అందిస్తున్నారన్నారు. ఈ పాస్‌ విధానం వల్ల నిత్యావసరాల పంపిణీ, సామాజిక పింఛన్లు అందజేసే విధానం అమల్లోకి వచ్చిందన్నారు. డీఎస్‌ఓ ధర్మారెడ్డి, ఏపీఆన్‌లైన్‌ ఎస్‌సీఏ వంశీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 
>
మరిన్ని వార్తలు