వైభవంగా ఉట్ల పరుష

18 Aug, 2017 22:05 IST|Sakshi
వైభవంగా ఉట్ల పరుష

ఉరవకొండ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో శుక్రవారం ఉట్ల పరుస వైభవంగా జరిగింది. ఈఓ అక్కిరెడ్డి, ప్రధాన అర్చకులు ద్వారకనాథచార్యులు ఆధ్వర్యంలో శ్రీవారి ఉత్సవ మూర్తులను ఆమిద్యాల పెన్నోబులేసుడి ఆలయం నుంచి పెన్నహోబిలానికి తీసుకొచ్చారు. అనంతరం స్వామి వారికి అభిషేకం, మహామంగళహారతి, కుంకమార్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీలక్ష్మినృసింహున్ని ప్రత్యేక పల్లకీలో ఆలయ పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం యువకులు ఉట్లపరుసలో పాల్గొని, ఉట్టిని పగులగొట్టారు.

మరిన్ని వార్తలు