చౌక మద్యంపై ప్రజలతో కలసి పోరాడుతాం

30 Aug, 2015 12:38 IST|Sakshi

పెద్దపల్లి : కేసీఆర్ సర్కార్ చౌక మద్యం తీసుకురావడం వల్ల రాష్ట్రంలో మరింత మంది తాగుబోతుల్ని తయారవుతారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ... చౌక మద్యంపై ప్రజలతో కలసి పోరాడతామని చెప్పారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నేతలు శ్రీధర్ బాబు, గండ్ర వెంకటరమణ, వివేక్, పొన్నం ప్రభాకర్, జిల్లా కంగ్రెస్ అధ్యక్షుడు మృత్యుంజయం తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు