ఏమని పొగడుదుమే..

23 Sep, 2016 22:16 IST|Sakshi
శ్రీవారి స్వర్ణ రథోత్సవం
– శ్రీవారి సేవకు స్వర్ణకాంతులతో సిద్ధమైన వాహనాలు
  –  అక్టోబర్‌ 3నుంచి బ్రహ్మోత్సవాలు
  
సాక్షి, తిరుమల: దేవదేవుని బ్రహ్మోత్సవాలకు  తిరుమల కొండ ముస్తాబవుతోంది. అక్టోబర్‌ 3 నుంచి 11వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి విహరించే 14 వాహనాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఆలయం ఎదురుగా ఉండే వైభవోత్సవ మండపంలోని వాహనాలకు  ఇంజనీర్లు, నిపుణులు బందం తుది మెరుగులు దిద్దారు. వాహనాలు బంగారు వర్ణంలో  దేదీప్యమానంగా రూపుదిద్దుకున్నాయి. స్వర్ణరథం, మహారథం హైడ్రాలిక్‌ బ్రేక్‌లను సరిచేసి సిద్ధం చేశారు. బ్రహ్మోత్సవాల కోసం ఆలయ మాడ వీధుల్లో కూడా బ్యారికేడ్లు, గ్యాలరీల నిర్మాణం దాదాపుగా పూర్తి చేశారు. 
 
 
 
 
మరిన్ని వార్తలు