కర్నూలు(సిటీ) : డాక్టర్ మౌలీ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్గా ప్రొఫెసర్ కె.ముజాఫిర్ అలీని నియమిస్తూ ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ జీవో ఆర్టీ నెం.54ను జారీ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో మొదటి ఉర్దూ యూనివర్సిటీని కర్నూలు నగరంలో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉర్దూ శాఖ ప్రొఫెసర్గా పనిచేస్తున్న కె.ముజాఫిర్ను ఈ వర్సిటీకి వీసీగా నియమించారు.