ఏసీబీ వలలో మోటర్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్

26 Dec, 2016 22:35 IST|Sakshi
చిత్తూరు: సహాయ మోటర్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ లంచం తీసుకుంటూ ఉన్నతాధికారులకు పట్టుబడ్డాడు. దీంతో అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నారు. ఈ సంఘటన చిత్తూరులో సోమవారం చోటుచేసుకుంది. పట్టణంలో సహాయ మోటర్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ సునీల్ కుమార్ ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా.. చిత్తూరు ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ బాలసుబ్రహ్మాణ్యం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయనపై విచారణ చేపట్టి విధుల నుంచి బహిష్కిరించారు.
మరిన్ని వార్తలు