వెంకన్న హుండీ ఆదాయం రూ.7.30 లక్షలు

9 Jun, 2017 19:29 IST|Sakshi
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : స్థానిక రామచంద్రరావు పేట వేంకటేశ్వరస్వామి దేవస్థానం హుండీని శుక్రవారం లెక్కించగా రూ.7,30,951 ఆదాయం సమకూరింది. 73 రోజులకు గాను ఈ ఆదాయం లభించినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి బీహెచ్‌వీఎస్‌ఎన్‌ కిశోర్‌కుమార్‌ తెలిపారు. ఒక అజ్ఞాత భక్తుడు రూ.500 నోట్ల కట్టను(రూ.50 వేలు)స్వామి వారికి సమర్పించినట్టు లెక్కింపులో గుర్తించారు. ఈఓ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్‌బోర్డ్‌ చైర్మన్‌ శలా మాణిక్యాలరావు, సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు