చేనేత కార్మికుడి అనుమానాస్పద మృతి

26 Jun, 2017 22:03 IST|Sakshi

ధర్మవరం అర్బన్ : పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన చేనేత కార్మికుడు పోలా రాజు (22) సోమవారం తెల్లవారుజామున అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. ఆదివారం రాత్రి ఇంట్లో తమతో కలిసి భోజనం చేసి అనంతరం సోఫాలో నిద్రించాడని తల్లిదండ్రులు రమాదేవి, రంగనాయకులు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున మగ్గం నేసేందుకు లేపగా ఎంతసేపటికి లేవలేదని, అనుమానం వచ్చి పరిశీలించగా అప్పటికే చనిపోయాడన్నారు. ఎలా మృతి చెందాడో తెలియడంలేదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుని కుటుంబ సభ్యులను కౌన్సిలర్‌ బండారు రామాంజనేయులు పరామర్శించారు.

మరిన్ని వార్తలు