పుష్కరాల ట్రాఫిక్ నియంత్రణకు 3300 మంది

6 Aug, 2016 15:32 IST|Sakshi

విజయవాడ : పుష్కరాల ట్రాఫిక్ నియంత్రణకు 3,300 మంది సిబ్బందిని నియమించినట్లు డీఐజీ శ్రీకాంత్ వెల్లడించారు. శనివారం విజయవాడలో డీఐజీ శ్రీకాంత్ మాట్లాడుతూ... విజయవాడ నగరాన్ని 19 జోన్లు, 70 సెక్టార్లుగా విభజించినట్లు తెలిపారు. 276 ఎకరాల్లో 122 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

అటు నెహ్రు బస్టాండ్ నుంచి కుమ్మరపాలెం వరకు.... ఇటు ప్రకాశం బ్యారేజీ నుంచి వన్టౌన్లోని అప్పారావు కూల్ డ్రింక్ షాప్ వరకు నో వెహికిల్ జోన్గా నిర్ణయించినట్లు చెప్పారు. ప్రకాశం బ్యారేజీపైనా వాహనాలతోపాటు భక్తులకు కూడా అనుమతి లేదని డీఐజీ శ్రీకాంత్ స్పష్టం చేశారు.

>
మరిన్ని వార్తలు