కడెం: ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామ సర్పంచ్, టీఆర్ఎస్ నాయకుడు గంగాధర్ నాయక్ను సస్పెండ్ చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసినట్టు గంగాధర్ నాయక్పై ఆరోపణలు వచ్చాయి. అధికారుల విచారణలో రూ.8 లక్షల మేరదుర్వినియోగం అయినట్టు తేలడంతో సస్పెండ్ చేసినట్టు సమాచారం.