వినాయక చవితి వేడుకల్లో విషాదం

5 Sep, 2016 18:20 IST|Sakshi

నెల్లూరు: వినాయక చవితి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. గణపతి మండపంలో మామిడి తోరణాలు కడుతుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. కోవురు మండలం యనమడుగులో ఈ సంఘటన జరిగింది. మృతులు పర్వతయ్య, రామకృష్ణగా గుర్తించారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
 

>
మరిన్ని వార్తలు