జూరాలకు సందర్శకులు

7 Aug, 2016 23:08 IST|Sakshi
దరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి భారీ ఎత్తున ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు క్రస్టుగేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టుకు సందర్శకుల తాకిడి పెరిగింది. ఆదివారం క్రస్టుగేట్ల వద్ద యువకులు సంచరిస్తూ సందడి చేశారు. ప్రమాదభరితంగా ఉన్న ప్రాంతాల్లో సైతం ఫోటోలకు ఫోజులిచ్చి సెల్ఫీలు తీసుకుని సంబరపడ్డారు. పీజేపీ అధికారులు ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా ఎలాంటి భద్రతా ఏర్పాట్లను చేపట్టలేదు. 
>
మరిన్ని వార్తలు