వీవోఏలకు గౌరవ వేతనం చెల్లించాలి

10 Jan, 2017 22:54 IST|Sakshi
వీవోఏలకు గౌరవ వేతనం చెల్లించాలి

ఎల్లారెడ్డిపేట:గత 14ఏళ్లుగా పేదరికంలో ఉన్న మహిళలను పో గు చేసి సంఘాలుగా ఏర్పాటు చేసిన ఐకేపీ వీవోఏలకు ప్రభుత్వం గౌరవ వేతనం చెల్లించాలని కోరుతూ ఐకేపీ వీఏవోలు సోమవారం జేసీ యాస్మిన్ బాషాను ప్రజావాణిలో కలిసి మొరపెట్టుకున్నారు. ఐకేపీ వీవోఏల సంఘం మండల అధ్యక్షులు రమా మాట్లాడుతూ రాష్ట్రంలో 18396మంది వీవోఏలు ఉన్నామన్నారు.

తెలంగాణ ప్ర భుత్వం ఏర్పాటు అయ్యాక సీఎం కేసీఆర్‌ ఐకేపీ వీవోఏల కు రూ. 5వేల వేతనం ఇస్తూ రెగ్యూలరైజ్‌ చేస్తామన్నారని పేర్కొన్నారు. అయినప్పటికీ గౌరవ వేతనం రాకపోవడమే కాకుండా రెగ్యూలరైజ్‌ కూడా చేయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.  గౌరవ వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కార్యక్రమంలో రాణి, రా మకళ, వాణిశ్రీ, పద్మ, మంజుల, మేఘన పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు