ఉత్సాహంగా వాలీబాల్‌ పోటీలు

13 Jan, 2017 23:41 IST|Sakshi
ఉత్సాహంగా వాలీబాల్‌ పోటీలు
నారాయణపురం (ఉంగుటూరు) : స్థానిక వివేకానంద జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో అండర్‌–17 జాతీయస్థాయి వాలీబాల్‌ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. శుక్రవారం నాకౌట్‌ దశకు చేరుకున్నాయి. బాలికల విభాగంలో లీగ్‌దశలో విజయం సాధించి కేరళ, పంజాజ్, తమిళనాడు, బీహర్, మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, హర్యానా జట్లు నాకౌట్‌కు చేరుకున్నాయి. బాలుర విభాగంలో కేరళ, ఉత్తరాఖండ్, ధిల్లీ, కర్నాటక, గుజరాత్, యూపీ, బీహర్, హర్యానా జట్లు నాకౌట్‌కు దశకు చేరుకున్నాయని నిర్వాహకులు ఆదిరెడ్డి సత్యనారాయణ తెలిపారు. 
 
మరిన్ని వార్తలు