తెలంగాణ విద్యాశాఖలో కలకలం

1 Aug, 2015 17:45 IST|Sakshi

వరంగల్: ఉపాధ్యాయుల బదిలీల్లో అవకతవకలకు పాల్పడ్డాడంటూ వరంగల్ డీఈవో చంద్రమోహన్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఆ మేరకు రాష్ట్రప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా చంద్రమోహన్ వరంగల్ జిల్లా విడిచి వెళ్లకూడదంటూ ఆదేశించింది. జిల్లాకు చెందిన ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి అయిన కడియం శ్రీహరికి విషయం తెలిసే ఉంటుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే ఉపాధ్యాయుల బదిలీల్లో ఇవన్నీ సర్వ సాధారణం అనే వాదనలూ అధికారుల నుంచి వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు