వరంగల్ నిట్‌లో స్నాతకోత్సవ సందడి

17 Dec, 2015 12:48 IST|Sakshi

వరంగల్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) క్యాంపస్ గురువారం స్నాతకోత్సవంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు డిగ్రీ స్నాతకోత్సవ పట్టాలను అందజేశారు. దీంతో విద్యార్థులు ఆనందంతో కేరింతలు కొట్టారు. టోపీలు గాలిలోకి ఎగురవేసి సెల్ఫీలు తీసుకున్నారు. నిట్ డెరైక్టర్ శ్రీనివాసరావు, ఫ్యాకల్టీ ,హెచ్‌వోడీలు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు