కుంటలకు జలకళ

28 Jul, 2016 22:58 IST|Sakshi
కుంటలకు జలకళ

అనంతపురం టౌన్‌ : జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు కుంటలు నిండి కళకళలాడుతున్నాయి.  మూడ్రోజులుగా 35 మండలాల్లో   భారీ వర్షాలు కురిశాయి. మిగిలిన మండలాల్లో కూడా మోస్తరు వర్షాలు పడిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని కుంటలు నిండినట్లు డ్వామా పీడీ నాగభూషణం తెలిపారు. ఇది రైతులకు ఎంతో ఉపయుక్తమన్నారు. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి చేపట్టే వనం–మనం కార్యక్రమంలో భాగంగా 12.56 లక్షల మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వినట్లు ఆయన వివరించారు. ï  వారం రోజుల పాటు వివిధ ప్రదేశాల్లో మొక్కలు నాటుతామన్నారు. 

మరిన్ని వార్తలు