ప్రకాశం బ్యారేజీ కుడికాల్వకు నీరు విడుదల

18 Jul, 2016 11:40 IST|Sakshi
విజయవాడ: ఎగువ ప్రాంతాల నుంచి ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో.. కుడి కాలువకు నీరు విడుదల చేస్తున్నారు. దీంతో కలిదిండి, కైకలూరు, కృత్తివెన్ను ప్రాంతాలకు సాగునీరు విడుదల చేస్తున్నారు. నీరు విడుదల కావడంతో కుడి ప్రధాన కాల్వగట్టుతో  పోలవరం కుడి కాల్వగట్టు, సమీప ప్రాంతాల్లోని కుడి ప్రధాన కాల్వగట్టు సమీప ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలవనరుల శాఖ అధికారులు సోమవారం హెచ్చరికలు జారీ చేశారు. 
మరిన్ని వార్తలు