హంద్రీనీవాకు నీరు విడుదల

6 Aug, 2016 00:18 IST|Sakshi
హంద్రీనీవాకు నీరు విడుదల
మిడుతూరు(నందికొట్కూరు): హంద్రీనీవా కాల్వకు శుక్రవారం నంద్యాల ఎంపీఎస్పీవైరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య..నీరు విడుదల చేశారు. నందికొట్కూరు మండలం మల్యాల మొదటి ఎత్తిపోతల పథకం వద్ద 9వ పంపునకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి.. స్విచ్‌ ఆన్‌ చేసి 350 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఈ జలంధర్‌ మాట్లాడుతూ.. కష్ణానది ఎగువ ప్రాంతం మహారాష్ట్రలో  భారీ వర్షం కురువడంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు చేరి,  శ్రీశైల జలాశయ నీటి మట్టం మధ్యాహ్నానికి  834.20 అడుగులు చేరుకుందని తెలిపారు. ప్రస్తుతం హంద్రీనీవాకు ఒక పంపు ద్వారా 350 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని, హంద్రీనీవా సామర్థాన్ని బట్టి విడతల వారిగా ఏడు పంపుల వరకూ నీటిని విడుదలచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో నందికొట్కూరు, డోన్‌ టీడీపీ నియోజకవర్ట ఇన్‌చార్జ్‌లు కేఈ ప్రతాప్, మాండ్రశివానందరెడ్డి, ఈఈ పురుషోత్తంరెడ్డి, డీఈలు ప్రసాద్, పాండురంగయ్య, ఏఈలు మల్లికార్జున, విజయ్‌కిశోర్, నందికొట్కూరు మార్కేట్‌యార్డు చైర్మన్‌  గుండం రమణారెడ్డి, ఎంపీపీ వీరం ప్రసాదరెడ్డి, నాయకులు వెంకట్రామిరెడ్డి, రాంభూపాల్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు