రైతు సంఘం మహాసభలను విజయవంతం చేయాలి

22 Jul, 2016 16:40 IST|Sakshi
రైతు సంఘం మహాసభలను విజయవంతం చేయాలి

నడిగూడెం: ఈ నెల 25న మండల కేంద్రంలో నిర్వహించనున్న తెలంగాణా రైతు సంఘం 16వ మహాసభలను విజవంతం చేయాలని సీపీఎం పార్టీ సీనియర్‌ నాయకుడు బుర్రి శ్రీరామలు కోరారు. శుక్రవారం ఆ మహాసభలకు సంబం«ధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  ఈ మహాసభల్లో అధిక సంఖ్యలో రైతులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం డివిజన్‌ ప్రధాన కార్యదర్శి ఏనుగుల వీరాంజనేయులు, నాయకులు బెల్లంకొండ సత్యనారాయణ, అనంతుల క్రిష్ణయ్య, సీతారాంరెడ్డి, మల్లెల వెంకన్న, బిక్షం, కాసాని కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.


 

మరిన్ని వార్తలు