కలెక్టరేట్‌ ముట్టడిని విజయవంతం చేయాలి

28 Aug, 2016 20:10 IST|Sakshi
కలెక్టరేట్‌ ముట్టడిని విజయవంతం చేయాలి

కోదాడఅర్బన్‌: ప్రభుత్వ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 30న ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించే కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పల్లపు శ్రీనివాస్‌ కోరారు. ఆదివారం కోదాడ పట్టణంలోని ఎస్టీ బాలుర వసతిగృహంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా విద్యార్థులకు మెస్‌ చార్జీలు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు నునావత్‌ రవి, సాయి, నగేష్, మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు