ఘట్కేసర్: ఆషాడమాసంలో అమ్మవారికి జరుగు ఉత్సవాల్లో భాగంగా మండలంలోని పోచారంలోని సర్వమంగళ స్పటికలింగేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారిని శనివారం అన్ని రకాల మిఠాయిలతో అలంకరించి పూజలు చేశారు. అలకరణ కోసం పలురకాల మిఠాయిలు ఉపయోగించినట్లు తెలిపారు. ఆషాడమాసోత్సవాల్లో అమ్మవారిని వివిధ రకాల పదార్థాలతో అలంకరిస్తున్నట్లు దేవాలయ నిర్వహకకమిటి చైర్మన్ చెరకు సరితా భద్రీనారాయణగౌడ్ తెలిపారు.అధిక సంఖ్యలోభక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు.