చిత్తూరు: వేగంగా వెళ్తున్న కారు ముందు వెళ్తున్న ఆటోను ఢీకొట్టిన ఘటనలో ఓ మహిళ మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన చిత్తూరు జిల్లా ఐతెపల్లి వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.
వేగంగా వెళ్తున్న స్విఫ్ట్ కారు ముందు వెళ్తున్న ప్రయాణికుల ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతి రూయా ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.