పిడుగు పడి మహిళ మృతి

2 Oct, 2015 17:06 IST|Sakshi

అనంతపురం : పిడుగు పడి మహిళ మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతపురం జిల్లా డి.ఇరెహాల్ మండలం వసగుడ్డం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు ... గ్రామానికి చెందిన మహిళ నీలమ్మ (38) తోపాటు  ఇద్దరు కూలీలు వ్యవసాయ పొలంలో పనులు చేసుకుంటున్నారు.

ఆ సమయంలో భారీ వర్షం వచ్చింది. దీంతో కూలీలు చెట్ల కిందకు పరుగులు తీశారు. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడింది. ఈ ఘటనలో నీలమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పొలంలోని కూలీలు వెంటనే స్పందించి క్షతగాత్రులను అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

>
మరిన్ని వార్తలు