హెచ్చెల్సీలో మహిళ గల్లంతు

18 Nov, 2016 01:33 IST|Sakshi

బుక్కరాయసముద్రం : మండలంలోని సంజీవపురం గ్రామంలో ఓ మహిâýæ ప్రమాదవ శాత్తూ హెచ్చెల్సీలో పడి కొట్టుకుపోయిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు మేరకు.. సంజీవపురం గ్రామంలో ఈశ్వరయ్య, భార్య శ్రీదేవి కూలి పనులు చేసుకుంటూ జీవనం గడుపుతూ ఉండేవారు.  గురువారం ఆమె కూలి పనుల కు వెళ్లింది. మధ్యాహ్నం ఇంటికి వస్తూ ప్ర మాదవశాత్తూ హెచ్చెల్సీలోకి పడింది.   

చు ట్టుపక్కల వారు చూసేసరికి ఆమె నీటి ప్రవా హంలో కొట్టుకుపోయింది. విషయం తెలు సుకున్న భర్త, బంధువులు, స్థానికులు సా యంత్రం వరకు గాలింపు చేపట్టారు. ఈతగాల్లు కాలువలో వెతికినా ఆమె కనపడలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు