నవ వధువును కాటేసిన కట్నం

22 Sep, 2016 21:43 IST|Sakshi

పహాడీషరీఫ్‌: అత్తింటి అరళ్లు భరించలేక  నవవధువు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం జరిగింది. ఎస్‌ఐ నర్సింగ్‌ రాథోడ్‌ కథనం ప్రకారం....కొత్తపేట గ్రా మానికి చెందిన అబ్దుల్లా బిన్ సాలె్హకు పర్వీన్ బేగం (30)కి ఐదు నెలల క్రితం వివాహమైం ది. పెళ్లైన కొన్ని రోజుల నుంచే పర్వీన్ ను అదనపు కట్నం తీసుకురావాలంటూ అబ్దుల్లా వేధించసాగాడు.

ఇదే విషయాన్ని పర్వీన్ తన తల్లికి తెలిపింది. దీంతో ఆగ్రహానికి గురైన పర్వీన్‌ తల్లి ‘నా కూతుర్ని ఎందుకు వేధిస్తున్నావని ఫోన్ చేసి అల్లుడిని దూషించగా.., అతడు కూడా ఆమెను తిట్టాడు. భర్త తన తల్లిని దూషించడంతో మనస్తాపానికి గురైన పర్వీన్ గురువారం ఉదయం ఇంట్లోని సీలింగ్‌ ఫ్యాన్ కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


 

మరిన్ని వార్తలు