సంతానం కల్గలేదని ఆత్మహత్య

14 Feb, 2017 22:53 IST|Sakshi
 దేవనకొండ : పెళ్లయి మూడేళ్లయినా సంతానం కల్గకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన ఓ మహిళ ఉరివేసుకుని మరణించింది. పోలీసుల వివరాల మేరకు .. మండల పరిధిలోని నల్లచెలిమల గ్రామానికి చెందిన రంగస్వామి దూదెకొండ గ్రామానికి చెందిన ముత్యాల సాంబశివుడి కుమార్తె శ్రీదేవి(21)ని  మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లి జరిగి మూడేళ్లు దాటినా సంతానం లేకపోవడంతో మనస్థాపం చెందిన శ్రీదేవి మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గంగయ్యయాదవ్‌ తెలిపారు. 
 
ఆస్తమాతో బాధపడుతూ యువకుడు..
ఆస్తమా వ్యాధితో బాధపడుతున్న దేవనకొండ మండలం నేలతలమరి గ్రామానికి చెందిన సిద్ధం వేణుగోపాల్‌రెడ్డి(25) జీవితం విరక్తి చెందిన మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యాధి తీవ్రమై తట్టుకోలేక ఇంట్లోనే పురుగు మందు తాగి మరణించాడు. ఘటనా స్థలానికి వెళ్లిన ఎస్‌ఐ గంగయ్యయాదవ్‌ వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
 
మరిన్ని వార్తలు