మహిళ అనుమానాస్పద మృతి

28 Aug, 2016 00:23 IST|Sakshi
దేవరపల్లి : దేవరపల్లి మండలం యాదవోలులో ఓ మహిళ అనుమానాస్పదస్థితిలో మరణించారు. ఎస్‌ఐ సి.హెచ్‌.ఆంజనేయులు కథనం ప్రకారం..  ద్వారకా తిరుమల మండలం గొడుగుపేటకు చెందిన  వెంకటలక్ష్మి(25) యాదవోలుకు చెందిన గుంపుల శ్రీనును ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆరేళ్ల కుమార్తె ఉంది. ఈ నేపథ్యంలో వెంకటలక్ష్మి శనివారం ఇంటిలో కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనిపై భిన్నవాదనలు వినబడుతున్నాయి. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఆంజనేయులు వెల్లడించారు. 
 
మరిన్ని వార్తలు