విషజ్వరంతో మహిళ మృతి

24 Aug, 2016 19:49 IST|Sakshi
రుద్రవరం(రెడ్డిగూడెం) : గ్రామానికి చెందిన వెలగలేని రుక్మిణీతాయారు(60) విష జ్వరం బారిన పడి మృతి చెందింది. ఆమె మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. గ్రామంలో మరికొంతమంది జ్వరంతో బాధపడుతున్నారు. రుక్మిణీ మృతితో గ్రామాల్లోని జ్వర పీడితులు భయాందోళనకు గురవుతున్నారు.
 
మరిన్ని వార్తలు