కుందుర్పి: మండల కేంద్రానికి చెందిన వివాహిత నాగమణి (20) మహిళ కడుపునొప్పి తాళలేక ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి గంగాధర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాలుగు నెలల క్రితం నాగమణికి వివాహమైంది. మూడు నెలలుగా కడుపునొప్పి ఉండేది. ఆదివారం కడుపునొప్పి తీవ్రం కావడంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.