'ఏపీలో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం'

13 Aug, 2015 12:15 IST|Sakshi
'ఏపీలో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం'

విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం విజయవాడలో జరుగుతున్న సీఐఐ కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రం సాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు.

ఏపీలో సుదీర్ఘమైన తీరప్రాంతం ఉందనీ, పారిశ్రామికాభివృద్ధికి అందరు సహకరించాలని సీఎం కోరారు. అమరావతి డెవలపర్ భాగస్వామిగా సింగపూర్ ముందుకొచ్చిందని చెప్పారు. రాష్ట్రానికి రెండు పారిశ్రామిక కారిడార్లు రానున్నాయని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు.

మరిన్ని వార్తలు