యోగానందం

21 Jun, 2017 21:26 IST|Sakshi
యోగానందం
  శ్రీశైలం:  ఆంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జిల్లాలో ఘనంగా జరిగాయి. విద్యాసంస్థలు, వసతిగ​ృహాల్లో విద్యార్థులు వివిధ రకాల ఆసనాలు వేసి ఆకట్టుకున్నారు. యోగా సాధన.. ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మికానందం చేకూర్చుతుందని యోగా గురువులు ఉద్భోదించారు. యోగాకు ఆది గురువైన పరమేశ్వరుడు కొలువుదీరిన శ్రీశైలమహాక్షేత్రంలో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.  శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో  సుమారు వెయ్యి మందితో ఉదయం 8గంటల నుంచి 9.30గంటల వరకు  యోగాసనాలు వేయించారు.  ఇక నుంచి ప్రతి ఏటా యోగా దినోత్సవాన్ని శ్రీశైలదేవస్థానం నిర్వహించేలా చేస్తానని ఈఓ భరత్‌గుప్త  ప్రకటించారు.
 
మరిన్ని వార్తలు