వైవీయూ వీసీగా ఆచార్య శ్యాంసుందర్

12 Jul, 2013 04:33 IST|Sakshi

వైవీయూ, న్యూస్‌లైన్ :
 యోగివేమన విశ్వవిద్యాలయం (వైవీయూ) నూతన వైస్ చాన్స్‌లర్‌గా ఆచార్య బి. శ్యాంసుందర్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీఅయ్యాయి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో కెమిస్ట్రీ విభాగంలో  ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన ఈయన నాగార్జున విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు పలు కీలకపదవులు నిర్వహించారు. కాగా  ఆరునెలలుగా ఖాళీగా ఉన్న వైస్ చాన్స్‌లర్ పదవికి పలువురు పోటీపడ్డారు.  ఎస్వీయూ ఆచార్యులు ఆదినారాయణరెడ్డి, ఉషారాణి ఇలా కొందరి పేర్లు వినిపించినా చివరకు ఆచార్య శ్యాంసుందర్ నియామకానికే  గవర్నర్ మొగ్గుచూపడంతో వైవీయూ మూడో వైస్ చాన్స్‌లర్‌గా నియమితులయ్యారు. కాగా ఆచార్య శ్యాంసుందర్ 2009-10 సంవత్సరంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును సైతం పొంది ఉండటం గమనార్హం.

>
మరిన్ని వార్తలు