భవిష్యత్‌ నేతలుగా ఎదగాలి

1 Aug, 2016 18:09 IST|Sakshi
 
భవిష్యత్‌ నేతలుగా ఎదగాలి
you will be next generation leaders
au campus, political science, future leaders, sarveypalli radha krishna
ఏయూ క్యాంపస్, రాజనీతి శాస్త్రం, భవిష్యత్‌ నేతలు, సర్వేపల్లి రాధాకష్ణన్‌
 
ఏయూక్యాంపస్‌:
విద్యార్థులు భవిష్యత్‌ తరం నేతలుగా ఎదగాలని ఏయూ ఉపకులపతి ఆచార్య గొల్లపల్లి నాగేశ్వరరావు అన్నారు. ఏయూ రాజనీతి శాస్త్ర విభాగంలో సోమవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కళాశాల వద్ద సర్వేపల్లి రాధాకష్ణన్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.ఈ సందర్భంగా విద్యార్థుల నుద్దేశించి మాట్లాడుతూ సానుకూల దక్పధంతో దుకెళ్లాలన్నారు. ఈ విభాగం ఎందరో ప్రభుత్వ అధికారులను దేశానికి అందించిందన్నారు. వారి నుంచి స్ఫూర్తిని పొందుతూ ఈ దిశగా పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా విభాగ ప్రగతిని తెలియజేసే ఫొటోలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ వీసీ ఆచార్య జి.ఎస్‌.ఎన్‌ రాజు, రెక్టార్‌ ఆచార్య ఇ.ఏ నారాయణ, రిజిస్ట్రార్‌ ఆచార్య వి.ఉమామహేశ్వరరావు, విభాగాధిపతి పి.ప్రేమానందం తదితరులు పాల్గొన్నారు.
 
 
 
 
 
 
మరిన్ని వార్తలు