చేర్యాల : తేలుకాటుకు గురై చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతి చెం దిన ఘటన మండలంలో ని దొమ్మాటలో సోమవా రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. దొమ్మాటకు చెందిన గడిల కృష్ణ(22) కూలీ పనికి వెళ్లగా తేలు కాటు వేసింది. దీంతో చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రాధమిక చికిత్స అనంతరం సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.
అతడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ నడిమింటి శ్రీనివాస్, ఎంపీటీసీ బొమ్మగోని రవిచందర్, మాజీ ఎంపీటీసీ మాచర్ల భారతమ్మ కోరారు.