రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

29 Aug, 2017 22:12 IST|Sakshi
రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

చీపురుపల్లి: పట్టణంలోని రెల్లివీధికి చెందిన కె.ప్రసాద్‌ (30) రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు జీఆర్‌పీ హెచ్‌సీ సింహాచలం తెలిపారు. మృతుని కుటుంబ సభ్యులు, పోలీసులు తెలియజేసిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రసాద్‌ స్థానిక మేజర్‌ పంచాయతీ కార్యాలయంలో కాంట్రాక్ట్‌ పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నాడు. అయితే కొద్దికాలంగా పచ్చకామెర్లతో బాధపడుతుండడంతో స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఆదివారం రాత్రి ఇంటి బయట పడుకున్న ప్రసాద్‌ సోమవారం తెల్లవారు ఝామున తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అయితే కామెర్లు ఎంతకీ తగ్గకపోవడంతో జీవితంపై విరక్తి చెంది సోమవారం ఉదయం స్థానిక రైల్వేస్టేషన్‌కు వెళ్లి విశాఖపట్టణం నుంచి గుణుపూరు వెళ్తున్న రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహానికి స్థానిక ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు హెచ్‌సీ సింహాచలం తెలిపారు.

>
మరిన్ని వార్తలు