హంద్రీనీవా కాలువలో యువతి మృతి

3 Jan, 2017 00:08 IST|Sakshi

నెహ్రూనగర్‌ (పగిడ్యాల): మతిస్థిమితం లేని ఓ యువతి ప్రమాదవశాత్తు హంద్రీనీవా కాలువలో పడి మృతి చెందింది. ఈ ఘటన సోమవారం నెహ్రూనగర్‌లో చోటుచేసుకుంది. వివరాలివీ.. గ్రామానికి చెందిన వీరమ్మ కూతురు తిరుపతమ్మ(22) పుట్టకతోనే మతిస్థిమితంతో బాధపడుతోంది. కుమార్తెను ఈమె జాగ్రత్తగా చూసుకునేది. అయితే సోమవారం..సీఎం బహిరంగ సభ కోసం ఆమె  ముచ్చుమర్రి వెళ్లారు. ఇంటికి తిరిగొచ్చే సరికి కుమార్తె కనిపించలేదు. ఆచూకీ కోసం  బంధువులను, ఇరుగుపొరుగు వారిని విచారించినా జాడ కనిపించలేదు. అనుమానం వచ్చిన బంధువులు నివాస ప్రాంతాలకు సమీపంలోని హంద్రీనీవా కాలువ వెంబడి గాలించి తిరుపతమ్మ మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనపై ముచ్చుమర్రి పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బంధువులు పేర్కొన్నారు. 

>
మరిన్ని వార్తలు