దైవదర్శనానికి వెళుతూ మరొకరు..

17 Sep, 2017 22:46 IST|Sakshi

అగళి: మండలంలోని ఎంఎం పాళ్యం గ్రామానికి చెందిన రవిచంద్ర (20) తన మిత్రులతో కలిసి బైక్‌లో శనీశ్వరస్వామి దర్శనం కోసం పావగడకు వెళుతుండగా పావగడ సమీపంలో టాటా సుమో వాహనం ఢీకొంది. బైక్‌లోని ముగ్గురికీ గాయాలయ్యాయి. రవిచంద్ర పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యం కోసం బెంగళూరుకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. పావగడ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రవిచంద్ర స్నేహితుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు