విద్యుదాఘాతంతో యువకుడి మృతి

29 Apr, 2017 00:39 IST|Sakshi
కర్నూలు: కర్నూలు మండలం మామిదాలపాడు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు కుమారుడు మధు (18) విద్యుదాఘాతానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గ్రామంలోని మేనమామ ఈరన్న దగ్గర మధు ఉంటాడు. గురువారం పెద్దమ్మ స్వగ్రామం ఆర్‌.కొంతలపాడుకు వెళ్లి రాత్రి మిద్దెపై పడుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున నిద్రలేచి కిందికి దిగుతుండగా మెట్ల దగ్గర విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 
>
మరిన్ని వార్తలు