పెద్దకడబూరు(కర్నూలు జిల్లా): కర్నూలు జిల్లాలోని పెద్దకడబూరు మండలం దొడ్డి మేకల గ్రామంలో ఓ వ్యక్తి పిడుగుపాటుకు మృతిచెందాడు. హుస్సేనీ(29) అనే యువకుడు పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.